Sunday, 27 October 2024

పెరుగన్నం

అన్నం లో పెరుగు,ఉప్పు కలుపుకుని,పక్కన ఉప్పు నిమ్మకాయ ఊరగాయ లేకపోతే కందిపచ్చడి నంచుకుంటే సరిపోతుంది.కానీ దేవుళ్ళకు నైవేద్యం పెట్టడానికి పెరుగన్నం చేస్తాము.ఇది ఇంకా బాగుంటుంది.అన్నం చల్లార్చుకోవాలి వెడల్పు గిన్నెలో.ఒక గ్లాస్ బియ్యానికి రెండున్నర నీళ్ళు పోసుకోవాలి వండడానికి.అన్నం వేడి పైన పెరుగు వెయ్యకూడదు.చల్లారిన అన్నం లోకి ఉప్పు,పెరుగు వేసి బాగా కలియపెట్టాలి.తగినంత పెరుగు వేసుకోవాలి.తరువాత కొంచెం నీళ్ళు,కొంచెం కాచీ చల్లారిన పాలు పోసుకోవాలి.ఇట్లా చేస్తే పెరుగన్నం కొంచెం గట్టి పడుతుంది,తొందరగా పులవదు.అల్లం,పచ్చి మిరపకాయలు,కరివేపాకు,కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి.తిరగమాత లోకి ఆవాలు,జీలకర్ర,రెండు ఎండు మిరపకాయలు,మినపప్పు,సెనగబేడలు.వేరు సెనగ గింజలు,ముంతమామిడి పప్పువేసుకోవాలి.నైవేద్యం కాకుండా వూరికినే ఇంట్లో తినేదానికి అయితే ఎండు మిరపకాయలు బదులు ఉప్పు మిరపకాయలు వేయించి వేసుకోవచ్చు. కొంత మంది పెరుగన్నం లోకి సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుంటారు.ఇంకొంత మంది దానిమ్మ గింజలు,ద్రాక్ష కలుపుకుంటారు.

No comments:

Post a Comment