Tuesday, 21 October 2025

రాగి పిండితో లల లాలా

ఈ మథ్య రాగి పిండి వాడకం ఎక్కువ అయింది ఆరోగ్యం పైన అవగాహన ఉన్నవాళ్ళకు. రాగి పిండిలో నీరు కలుపుకుని జారుగా వచ్చేలాగా చేసుకోవాలి.గిన్నెలో నీళ్ళు తెర్ల బెట్టుకోవాలి.నీళ్ళు తెర్లేటప్పుడు పలచగా కలుపుకున్న రాగిపిండిని వెయ్యాలి,కలుపుకుంటూ.అడుగు అంటకుండా,కొంచెంగా సెగ తగ్గించి,కలియ పెడుతూ ఒక పది నిముషాలు తెర్లనివ్వాలి.చల్లారినా జావలాగా,జారుగా ఉండేలా నీరు పోసుకోవాలి.రెండోరోజుకి పులుస్తుంది. పిల్లలకు పాలల్లో కలిపి ఇవ్వవచ్చు మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకుని తాగవచ్చు.లేకపోతే పచ్చి మిరపకాయలు,ఎర్రగడ్డ ముక్కలు,కరివేపాకు,కొత్తిమీర,కొంచెం ఉప్పు వేసుకుని తాగవచ్చు. నేను అయితే పులుసు,చారు,మజ్జిగ అన్నాలు తినేటప్పుడు రెండు చెంచాలు లేక ఒక గరిటడు జావ వేసుకుని తినేస్తాను. అలవాటు ఉన్నవాళ్ళైతే హాయిగా రాగి సంకటి చేసుకుని తినవచ్చు. రాగి సంకటికి ఒకటికి నాలుగు నీళ్ళు పోసుకుని అన్నం ఉడక పెట్టాలి.అన్నం ఉడికింది అని తెలియగానే కలిపి పెట్టుకున్న రాగి పిండి వేసి గట్టిగా కలబెడుతూ ఉండాలి.నీరు బాగా ఇంకేదాకా,ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.చల్లారిన తరువాత ముద్దలుగా చేసుకోవచ్చు.గొడ్డు కారము,పులుసుకూర,పచ్చి పులుసు బాగా ఉంటాయి నంచుకునేదానికి.